టైంజ్యోతి షాబాద్: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, తదితర సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చందనవెల్లి గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి, గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసి గ్రామ సమస్యలపై చర్చించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఉపసర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
Save & Share image
Views : 153














